దేశానికి నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు అవసరం : ఈటల

by Disha Web Desk 23 |
దేశానికి నరేంద్ర మోదీ లాంటి బలమైన నాయకుడు అవసరం : ఈటల
X

దిశ, అల్వాల్: ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుంచి ఈటల రాజేందర్ ప్రచారంలో దూసుకుపోతున్నారు. కాలనీలు, బస్తీలు అనే తేడా లేకుండా ఇంటింటా కలియ తిరుగుతూ బీజేపీకి ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థిస్తున్నారు. దేశానికి 10 ఏళ్ల కాలంలో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టి ప్రజలు ఓట్లు వేయాలని కోరారు. దేశ పురోగతితో పాటు ప్రజల కోసం ప్రకటించిన సంక్షేమ పథకాల పట్ల ప్రజలు ఆలోచించాలని కోరారు. మంగళవారం మచ్చ బొల్లారం డివిజన్ ఏడు గుళ్ళు నుండి అల్వాల్ లోని ఇందిరా గాంధీ చౌరస్తా వరకు బీజేపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రానున్న రోజులలో దేశం మరింత ముందుకు పోనీకి నరేంద్ర మోడీ లాంటి బలమైన నాయకుడు అవసరమని గుర్తు చేశారు.

ఇతర పార్టీలు చెపుతున్న మోసపు మాటలు నమ్మి ఓట్లు వేసి దేశాన్ని వెనకకు నెట్టొద్దని కోరారు. నరేంద్ర మోడీని గెలిపించి దేశాన్ని ప్రపంచ స్థాయిలో మొదటి స్థానంలో నిలిపేందుకు ప్రజలు ముందుకు రావాలని కోరారు. మోడీ పంపిన అభ్యర్థిగా మీ ముందుకు వచ్చానని మల్కాజిగిరి ఓటర్లు నన్ను గెలిపించి నరేంద్ర మోడీకి కానుకగా ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు అరుల్రాజ్, దండుగుల వెంకటేష్ ,మల్కాజ్గిరి కో కన్వీనర్ మల్లికార్జున గౌడ్, అల్వాల్ మల్కాజ్గిరి కి చెందిన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Next Story