జోగిపేటలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం

by Disha Web Desk 15 |
జోగిపేటలో ఘనంగా సీతారాముల కళ్యాణోత్సవం
X

దిశ, అందోల్‌ : శ్రీ సీతారాములు కళ్యాణోత్సవాన్ని అంగరంగ వైభవంగా అందోల్​ నియోజవకర్గ వ్యాప్తంగా బుధవారం నిర్వహించారు. ఆయా మండలాల పరిధిలోని హనుమాన్‌ దేవాలయాలు, రామ మందిరాలను అందంగా అలంకరించి కన్నుల పండువగా సీతాదేవి, శ్రీ రాముడి కల్యాణ మహోత్సవాన్ని నిర్వహించారు. జోగిపేటలోని పబ్బతి హనుమాన్, వీర హనుమాన్‌ దేవాలయాల వద్ద నిర్వహించిన సీతారాముల కళ్యాణోత్సవ వేడుకలకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సీ.దామోదర్‌ రాజనర్సింహ, ఎంపీ బీబీపాటిల్‌లు వేర్వరుగా హాజరయ్యారు.

ముందుగా ఆయా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, సీతాదేవి–శ్రీరాముడిని దర్శించుకున్నారు. పబ్బతి హనుమాన్‌ దేవాలయం వద్ద హాజరైన మంత్రి దామోదర్‌తో పాటు రాజకీయ, పట్టణ ప్రముఖులను కౌన్సిలర్‌ చిట్టిబాబు శాలువాతో సత్కరించారు. పబ్బతి హనుమాన్‌ దేవాలయం వద్ద కళ్యాణోత్సవాన్ని భక్తులు లైవ్‌లో తిలకించేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లను ఏర్పాటు చేసి, అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్ లు ఎస్.సురేందర్ గౌడ్, రంగ సురేష్, డి.శంకర్, దుర్గేష్, చందర్, హరి కృష్ణా గౌడ్, భారతి, మాజీ జడ్పీటీసీ రాజేందర్ పాటిల్, మాజీ సర్పంచ్ లు ఎస్.కృష్ణారెడ్డి, ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ డీజీ.వెంకటేష్, నాయకులు సత్యవ్రత్, శ్రీను, రవి, రాములు పాల్గొన్నారు.


Next Story

Most Viewed