గోబెల్ మళ్లీ పుట్టాడు.. ట్విట్టర్ వేదికగా KCRపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

by Disha Web Desk 4 |
గోబెల్ మళ్లీ పుట్టాడు.. ట్విట్టర్ వేదికగా KCRపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ చీఫ్ , మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు. ‘కేసీఆర్‌ను చూస్తే గోబెల్ మళ్లీ పుట్టాడనిపిస్తోంది.. మొన్న సూర్యాపేటలో, నిన్న మహబూబ్ నగర్‌లో, ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి శాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న 2023 మేలో కూడా యూనివర్సిటీ చీఫ్ వార్డెన్ వేసవి సెలవులకు సంబంధించి, నెల రోజుల పాటు హాస్టళ్లు, మెస్‌లు మూసివేయడం గురించి ఇటువంటి నోటీసునే జారీ చేశారు. (తేదీ 12-05-2023 నుండి 05-06-2023 వరకు). అందులో కూడా విద్యుత్, నీటి కొరతల గురించి ప్రస్తావించారు. కాంగ్రెస్ వచ్చాకే యూనివర్సిటీ మూసేస్తున్నట్టు దిక్కుమాలిన దివాళా కోరు ప్రచారం చేయడం కేసీఆర్ దిగజారుడుతనానికి పరాకాష్ట.’ అని రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.

Next Story