జాతీయ జెండాను అవమానించిన ప్రైవేటు స్కూల్ డైరెక్టర్

by Dishafeatures2 |
జాతీయ జెండాను అవమానించిన ప్రైవేటు స్కూల్ డైరెక్టర్
X

దిశ, సంగారెడ్డి మున్సిపాలిటీ: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో జాతీయ పతాకానికి అవమానం జరిగింది. సోమవారం దేశమంతా 75వ వజ్రోత్సవాలు పండుగలా జరుపుకుంటున్న విషయం తెలిసిందే. సంగారెడ్డి శాంతినగర్‌లోని సెయింట్ జోసెఫ్ పాఠశాలలో త్రివర్ణపతాకానికి అవమానం జరిగింది. పాఠశాలలో ఏర్పాటు చేసిన జాతీయ జెండా గద్దెపై త్రివర్ణ పతాకంపై ఉండే కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగులపై నుంచి షూస్‌తో ఎక్కి అవమానించాడు పాఠశాల డైరక్టర్ బాలిరెడ్డి.

జెండా వందనానికి వచ్చిన విద్యార్థులు, టీచర్లు, సిబ్బంది, దేశ భక్తి అభిమానులు చూసి చలించారు. అలా చేయడం చట్టరీత్యా నేరమని, జాతీయ జెండాను అవమానించినట్టు అని తెలిసినా డైరెక్టర్ మతి భ్రమించి చేస్తున్నాడా అని అక్కడికి వచ్చినవారు ఆగ్రహించారు. జాతీయ జెండాను అవమానించిన డైరెక్టర్ బాలిరెడ్డిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి.



Next Story

Most Viewed