ఛత్రపతి శివాజీ ఆశయాలను నెరవేరుద్దాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Disha Web Desk 11 |
ఛత్రపతి శివాజీ ఆశయాలను నెరవేరుద్దాం: ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, మిరుదొడ్డి: మరాఠా యోధుడు, హైందవ ధర్మ సంరక్షకుడు, ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆశయాలను నెరవేర్చే దిశగా ప్రతి గ్రామంలోని హైందవ యువకులు హిందూ ధర్మ రక్షణలో పాలుపంచుకోవాలని సూచించారు. సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి మండలంలోని ధర్మారం గ్రామంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహానికి దుబ్బాక ఎమ్మెల్యే పూలమాలవేసి నివాళులు అర్పించారు.

అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పెద్దలు, యువకులు సమష్టి కృషితో శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల నాయకులు, ప్రజాపతినిధులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed