- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కేంద్రంలో బిజెపి అధికారంలోకి వస్తే మరో 5 సంవత్సరాలు ఉచిత రేషన్ పంపిణీ : రఘునందన్ రావు
దిశ,వెల్దుర్తి : కేంద్రంలో బిజెపి పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే పేదలకు ఐదేళ్లపాటు ఉచిత రేషన్ బియ్యాన్ని ఇవ్వనున్నట్లు మెదక్ బిజెపి పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు తెలిపారు. సోమవారం వెల్దుర్తి మండల కేంద్రంలో రోడ్ షో నిర్వహించి అనంతరం మాట్లాడారు.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 6 ఆరు గ్యారంటీ తో పాటు రెండు లక్షల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను, మహిళలు, రైతులను మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
కరోనా సమయంలో మూడు సంవత్సరాల పాటు ఉచిత రేషన్ అందించిన ఘనత తమదేనని మళ్లీ పార్లమెంటు ఎన్నికల్లో బిజెపి పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ఐదు సంవత్సరాల వరకు రేషన్ ఉచితంగా ఇవ్వడం జరుగుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఐదు నెలల గడుస్తున్న వృద్ధులకు పింఛన్లు నాలుగువేల రూపాయలు ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం నెలకు నాలుగున్నర లక్షల జీతం తీసుకుంటున్నరన్నారు.
మాజీ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంచి దోస్తులు కానీ మదన్ రెడ్డి నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఏమీ అభివృద్ధి చేయలేదని కనీసం రోడ్లు కూడా వేయించలేని దుస్థితి నెలకొందని మండిపడ్డారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, మండల అధ్యక్షుడు చెంది నరసింహులు, నాయకులు కర్రె వెంకటేశం, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.