- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కాంగ్రెస్ లోకి మ్యాడం బాలకృష్ణ
దిశ, మెదక్ ప్రతినిధి : ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లిన మ్యాడం బాలకృష్ణ మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గురువారం గాంధీ భవన్ లో జగ్గారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఏఐసీసీ ఆధ్వర్యంలో చేరికల కమిటీ వేసింది. ఇందులో సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మహేష్ కుమార్ గౌడ్, కోదండ రెడ్డి లు ఉన్నారు.
వీరి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి ఇతర పార్టీలో వెళ్లిన వాటిని మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకోవాలన్న ఉద్దేశంతో కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో మైనం పల్లి రోహిత్ కు కాంగ్రెస్ పార్టీ టిక్కెట్ ఇవ్వడంతో మ్యాడం బాలకృష్ణ బీఆర్ ఎస్ పార్టీలో చేరారు. ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో కొంత కాలంగా మౌనంగా ఉన్న మ్యాడం బాల కృష్ణను చేరికల కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు బాలకృష్ణ తెలిపారు.