వట్టెం దేవాలయంలో మహేశ్ బాబు భార్య నమ్రత ప్రత్యేక పూజలు

by Disha Web Desk 2 |
వట్టెం దేవాలయంలో మహేశ్ బాబు భార్య నమ్రత ప్రత్యేక పూజలు
X

దిశ, బిజినేపల్లి: మండల పరిధిలోని వట్టెం వెంకన్న ఆలయానికి హీరో మహేష్ బాబు సతీమణి నమ్రత సందర్శించారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి తీర్థప్రసాదాలు స్వీకరించారు. అంతకముందు అర్చకులు పూర్ణకుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నమ్రత మాట్లాడుతూ.. వట్టెం దేవస్థానం ఎంతో పవిత్రమైందని, దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆలయం ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉందని అన్నారు. ఇక్కడకు రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట పలువురు ప్రముఖులు ఉన్నారు.


Next Story

Most Viewed