- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
సమర్థుడికి ఓటు వేస్తే మంచి భవిష్యత్తును నిర్ణయిస్తాడు : వంశీచంద్ రెడ్డి
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: సమర్థవంతమైన నాయకత్వం గల సమర్థుడికి ఓటు వేస్తే మీ భవిష్యత్తును తీర్చిదిద్దే విధంగా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటాడని మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు.స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయ ఆవరణలో బుధవారం మహబూబ్ నగర్ పార్లమెంటు కేంద్ర నూతన కార్యాలయాన్ని ఆయన ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి తో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించి మాట్లాడారు.బీజేపీ,బీఆర్ఎస్ పార్టీలు పచ్చి అబద్ధాలతో ప్రజలను పక్కతోవ పట్టిస్తున్నారని, నిజానికి వారు వేరు వేరు కాదని,ఒకే మూసలోని విషసర్పాలని ఆయన తీవ్రంగా విమర్శించాడు.
మత విద్వేషకులకు ఓటు వేస్తే సుస్థిర పాలన అందించలేరని,మత ఘర్షణలతో విద్యేషాలు రెచ్చగొడతారని,ఇందుకు మణిపూర్ సంఘటనే సాక్ష్యం అని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మంచి విద్యాదీకుడు,సమర్థ నాయకుడు మహబూబ్ నగర్ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డి ని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ కార్యక్రమంలో టిపీసీసీ ప్రధాన కార్యదర్శులు వినోద్ కుమార్,సంజీవ్ ముదిరాజ్,బీసీ కార్పొరేషన్ చైర్మెన్ శ్రీకాంత్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు వసంత,ఏపి.మిథున్ రెడ్డి,సిజె.బెనహర్,బెక్కరి మధుసూదన్ రెడ్డి,లక్ష్మణ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.