భారీ అగ్ని ప్రమాదం.. మూడు షాపులు దగ్ధం

by Disha Web Desk 4 |
భారీ అగ్ని ప్రమాదం.. మూడు షాపులు దగ్ధం
X

దిశ, నాగర్‌కర్నూల్ : నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని శ్రీపురం చౌరస్తాలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి గాలి వేగంగా వీచడంతో కరెంటు వైర్లు తగిలి అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... శ్రీపురం చౌరస్తాలోని ఫుట్ పాత్‌పై గత ప్రభుత్వం డబ్బాలు ఏర్పాటు చేసింది. సోమవారం రాత్రి గాలి వేగంగా వీచడంతో కరెంటు వైర్లు తగిలి అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ అగ్ని ప్రమాదంలో బెల్టు షాపు, ఫుట్‌వేర్ షాపు, పండ్ల దుకాణాలు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు మూడు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. గంటపాటు మంటలు ఎగిసి పడ్డాయి.అయితే స్థానికులు మంటలు ఆర్పడానికి ఫైర్ ఇంజన్ అధికారులకు సమాచారం ఇచ్చే ప్రయత్నాలు చేసినప్పటికీ వారు స్పందించలేదు. చివరికి ప్రైవేట్ ట్యాంకర్‌లతో మంటలు ఆర్పారు. అప్పటికే జరగవలసిన నష్టం జరగడంతో ఆ దుకాణం దారులు కన్నీటి పర్యంతమవుతున్నారు. బాధితులను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కుచుకుల రాజేష్ రెడ్డి, బిజెపి ఎంపీ అభ్యర్థి భరత్ ప్రసాద్, కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి, తదితరులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదానికి దారి తీసిన కారణాలను తెలుసుకున్నారు.



Next Story

Most Viewed