- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కారుతో ఢీకొట్టి కర్రలతో దాడి చేసి హత్యాయత్నం
దిశ, నాగర్ కర్నూల్ / తిమ్మాజిపేట్ : నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట మండలం గోరిట గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. భూ తగాదాలు పాత కక్షలు మనసులో పెట్టుకొని ఓ వ్యక్తిని అదే గ్రామానికి చెందిన ఇరువురూ వ్యక్తులు వెనకనుండి కారుతో ఢీకొట్టి కర్రలతో దాడి చేసి హత్యకు యత్నించారు. ఈ ఘటన గోరిట గ్రామ శివారులోని ప్రధాన రహదారిపై బుధవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గోరిట గ్రామానికి చెందిన ఏం.డి అజీద్, అదే గ్రామానికి చెందిన ఎండి.మతీన్, ఎండి.అఫీజ్ల మధ్య భూ తగాదాలు ఉన్నాయి. గత రెండు రోజుల క్రితం దాడి చేయగా బాధితుడు అజీజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తావా అంటూ ఏకంగా కారుతో ఢీ కొట్టి కర్రలతో విచక్షణ రహితంగా దాడికి దిగి హత్యకు యత్నించారు. అటుగా వెళుతున్న వాహనదారులు అడ్డుకొని 108 సాయంతో మహబూబ్ నగర్ ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.