KTR చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
KTR చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుంది.. CM రేవంత్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్ : ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి తొలిసారి స్పందించారు. గాంధీ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్‌పై విచారణ జరుగుతోందన్నారు. ఎవరైనా ఇతర కుటుంబ సభ్యుల కాల్స్ వింటారా అని ప్రశ్నించారు. కొన్ని ఫోన్లు విన్నామని కేటీఆర్ చెపుతున్నారని.. వింటే చర్లపల్లిలో చిప్పకూడు తినాల్సి వస్తుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.కేటీఆర్ తాగుబోతులా.. అచ్చోసిన ఆంబోతులా మాట్లాడుతున్నాడని.. ఫలితం అనుభవిస్తాడని మండిపడ్డారు. బీఆర్ఎస్ నేతలు చెప్పినట్లు విన్న అధికారుల పరిస్థితి.. ఇప్పుడెలా ఉందో చూస్తున్నామన్నారు. గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ చేసి.. భార్యాభర్తలు ఏం మాట్లాడుకున్నారో కూడా విన్నారని తెలిపారు. అధికారులకు ఆ రోజే చెప్పానని.. వినలేదన్నారు. ఇవాళ జైలుకు వెళ్తే అటు వైపు బీఆర్ఎస్ నాయకులు చూడటం లేదన్నారు.


Next Story

Most Viewed