కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కంగ్రాట్స్.. అంతలోనే.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు

by Disha Web Desk 4 |
కేంద్రమంత్రి కిషన్ రెడ్డికి కంగ్రాట్స్.. అంతలోనే.. కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు
X

దిశ, తెలంగాణ బ్యూరో: కేంద్రమంత్రి కిషన్ రెడ్డిపై మంత్రి కేటీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ట్విట్టర్ లో ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను స్థాపించాలని భావిస్తోందని, హైదరాబాద్‌లో గ్లోబల్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల నగరానికి, రాష్ట్రానికి మేలు జరుగుతుందనేది తన ప్రగాఢ విశ్వాసమని కిషన్ రెడ్డి ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. దీనికి కేటీఆర్ బుధవారం రీ ట్వీట్ చేశారు. 'ప్రతిష్టాత్మకమైన జాతీయ సంస్థను రాష్ట్రానికి తీసుకువచ్చినందుకు NPA ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రి కిషన్ రెడ్డి జీకి అభినందనలు ఓహ్ ఆగండి! ఎప్పటిలాగే, గుజరాత్ ప్రధానమంత్రి దానిని జామ్‌నగర్‌కు తరలించాలని నిర్ణయించుకున్నారు, తెలంగాణపై మోడీ జీ వివక్ష యొక్క కథ నిరంతరం కొనసాగుతోంది' అని మండిపడ్డారు. కేంద్రం మంజూరు చేసిన ఐ ఐ ఎం -7, ఐఐటీ -7, ఐఐఎస్ఈఆర్-2, త్రిబుల్ ఐటీ -16,ఎన్ఐడీ -4, మెడికల్ కాలేజ్ 157, నవోదయ 84 ఇందులో తెలంగాణకు ఒకటి కూడా కేటాయించకపోవడం కేంద్రం తెలంగాణపై వివక్షతను స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు.



Next Story

Most Viewed