కేసీఆర్‌ కరీంనగర్‌లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించింది : గంగుల

by Disha Web Desk 23 |
కేసీఆర్‌ కరీంనగర్‌లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించింది : గంగుల
X

దిశ, కరీంనగర్ టౌన్ : కేసీఆర్‌ కరీంనగర్‌లో అడుగుపెట్టగానే ఈ నేల పులకించిపోయిందని బీఆర్‌ఎస్‌ నేత గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ కదనభేరి సభలో గుంగుల కమలాకర్‌ ప్రసంగిస్తూ.. 2001లో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్‌ఎస్‌ పార్టీని స్థాపించినప్పుడు కేసీఆర్‌ ఈ కరీంనగర్‌ గడ్డ నుంచే సింహగర్జణ చేశారని, ఆ తర్వాత విజయవంతంగా లక్ష్యాన్ని సాధించారని గంగుల గుర్తుచేశారు.

దళితబంధు, రైతుబంధు లాంటి పథకాలను కేసీఆర్‌ ప్రభుత్వం ఇక్కడి నుంచే ప్రారంభించి సక్సెస్‌ఫుల్‌గా అమలు చేసిందని చెప్పారు. ఇప్పుడు పార్లమెంట్‌ ఎన్నికల కోసం ఈ కరీంనగర్‌ గడ్డ నుంచే కదనభేరి మోగించేందుకు కేసీఆర్‌ వచ్చారని అన్నారు. ఈ కదనభేరితో లోక్‌సభ ఎన్నికల కదనరంగంలో దూకి ఘన విజయం సాధిద్ధామని పిలుపునిచ్చారు. పార్లమెంటులో కొట్లాడి కరీంనగర్‌ను స్మార్ట్‌ సిటీగా మార్చిన ఘనత అప్పటి మన ఎంపీ వినోద్‌కుమార్‌కే దక్కుతుందని గంగుల అన్నారు.



Next Story

Most Viewed