- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కంకర వేశారు.. రోడ్డు వేయడం మరిచారు..
దిశ,సుల్తానాబాద్ : కాంట్రాక్టర్ అసమర్థతతో రోడ్డు నిర్మాణం ఆగిపోవడంతో ప్రయాణికులు, వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. వివరాల్లోకి వెళితే సుల్తానాబాద్ నుండి గట్టేపల్లి వరకు రోడ్డు వెడల్పు చేస్తూ నూతన రహదారి నిర్మాణం కోసం నిధులు మంజూరు అయ్యాయి. కానీ ఆ కాంట్రాక్టర్ అసమర్థత నిర్లక్ష్యంతో రోడ్డును ఇరువైపులా త్రవ్వి, మట్టి కుప్పలు, కంకర పోసి దాదాపు మూడు నెలలు గడుస్తున్న రోడ్డు నిర్మాణం చేపట్టక ప్రజలను, వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. నిత్యం రాత్రింబవళ్లు గట్టేపల్లి కి వెళ్లే వాహనదారులు, ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు.
రాత్రి వేళల్లో కంకర మీద ప్రయాణం చేయలేక ద్విచక్ర వాహన దారులు జారి పడి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి. అయినా సంబంధిత కాంట్రాక్టర్ రోడ్డు పనుల మీద దృష్టి సారించకపోవడమే దీనికి ప్రధాన కారణమని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. సంబంధిత అధికారులు కూడా చోద్యం చూస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి కాంట్రాక్టర్ రోడ్డు పనులు జరిపించేలా చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు.