- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం
దిశ, చొప్పదండి : బీజేపీతో కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పట్టణంలో రోడ్ షోను బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్, స్థానిక నాయకులతో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ను కేంద్ర పాలిత ప్రాంతం చేయడానికి బీజేపీ, కాంగ్రెస్ కలిసి ప్రయత్నం చేస్తున్నాయని అన్నారు. కాంగ్రెస్ బీజేపీతో కలిసి కరీంనగర్ లో ఒప్పందం కుదుర్చుకొని డమ్మీ కాంగ్రెస్ అభ్యర్థిని నిలబెట్టి ప్రశ్నించే గొంతుక వినోద్ కుమార్ ను
ఓడ కొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ ప్రజలను మోసం చేసి ప్రభుత్వంను ఏర్పాటు చేసిందన్నారు. ఇచ్చిన హామీల్లో ఫ్రీ బస్సు తప్ప ఒక్కటి కూడా అమలు చేయలేదని అన్నారు. ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి 12 ఎంపీ సీట్లు ఇస్తే సంవత్సరంలోగా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్యక్రమంలో చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకే రవి శంకర్, ఎంపీపీ చిలుక రవీందర్, జెడ్పీటీసీ మాచర్ల సౌజన్య, పీఏసీఎస్ చైర్మన్ లు మల్లారెడ్డి, తిరుపతిరావు, మాజీ మార్కెట్ చైర్మన్ లు, మండల, పట్టణ శాఖ అధ్యక్షులు, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.