బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి

by Kalyani |
బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి
X

దిశ, మిర్యాలగూడ టౌన్ : మిర్యాలగూడ లోని బాపూజీ నగర్ లో సోమవారం అర్ధరాత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు అమానుషంగా దాడి చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా పట్టణ బీఆర్ఎస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… దుర్గాచారి, శ్యామ్, క్రాంతి,జనార్ధన్, శ్రీనివాస్ ల ఇళ్ళపై మారణాయుధాలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని పేర్కొన్నారు . ఈ దాడిలో గాయాలైన వారిని హాస్పిటల్ లో చికిత్స చేయించినట్లు తెలిపారు. చికిత్స అనంతరం ఇంటికి చేరుకున్న దుర్గచారి, జనార్ధన్ ,శ్యామ్ ల ఇళ్ళపై వార్డుకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు పాతూరి ప్రసాద్, పాతూరి మురళీ, అఖిల్, వేంకటేశ్వర రావు, శరత్, శ్రీనివాస్ ,తన్నీరు సాయి ,రవి లు దాడి చేసి ఇంటి ప్రహరీ గోడ కూల్చి వేశారని అన్నారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.



Next Story

Most Viewed