కరీంనగర్ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరో నేత

by Disha Web Desk 9 |
కరీంనగర్ కాంగ్రెస్‌లో బిగ్ ట్విస్ట్.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన మరో నేత
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల జోరు నడుస్తోంది. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమై నేటికి ఆరవ రోజు అవ్వగా.. నేడు కరీంనగర్ నుంచి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ వేశారు. ప్రవీణ్ రెడ్డి తరఫున ఆయన అనుచరులు కూడా వెళ్లారు. కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా ఇప్పటికే వెలిచాల రాజేందర్ రావు నామినేషన్ వేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ అధిష్టానం టికెట్ ఇంకా ఖరారు చేయకున్నా కరీంనగర్ ఎంపీ అభ్యర్థులుగా వెలిచాల రాజేందర్ రావు, అల్గిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ వేశారు. కరీంగనర్ నుంచి ఏకంగా ఇద్దరు ఎంపీ అభ్యర్థులుగా నామినేషన్ వేయడం ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

CLICK HERE FOR TWITTER VIDEO



Next Story

Most Viewed