10 ఏళ్లు చీకటిలో ఉన్న తెలంగాణకు రేవంత్ రెడ్డి మండే సూర్యుడిలా వచ్చాడు: కడియం కావ్య

by Disha Web Desk 9 |
10 ఏళ్లు చీకటిలో ఉన్న తెలంగాణకు రేవంత్ రెడ్డి మండే సూర్యుడిలా వచ్చాడు: కడియం కావ్య
X

దిశ, వెబ్‌డెస్క్: వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కడియం కావ్య బుధవారం రెండో సెట్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ నామినేషన్ లో భాగంగా రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జ్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారిలతో కలిసి కావ్య వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా కడియం కావ్య మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీపై సంచలన కామెంట్స్ చేశారు. 10 ఏళ్లు చీకటిలో ఉన్న తెలంగాణకు రేవంత్ రెడ్డి మండే సూర్యుడి లాగా వచ్చాడు అంటూ ముఖ్యమంత్రిపై పొగడ్తల వర్షం కురిపించారు. ఇన్నేళ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ చేయలేనివి ఇప్పుడు రేవంత్ అన్న చేసి చూపిస్తాడని కడియం కావ్య గొంతెత్తి చెప్పుకొచ్చారు. తెలంగాణకు మంచి రోజులొచ్చాయన్నారు. కానీ బీఆర్ఎస్ పార్టీ తొక్కిపాడేయాలని చూస్తుందని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు.



Next Story

Most Viewed