ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 15 |
ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, శేరిలింగంపల్లి : నిత్యం ప్రజల మధ్య ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించే ఏకైక నాయకుడు కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాత్రమేనని ఆయన సతీమణి కొండా సంగీతారెడ్డి అన్నారు. శనివారం ఆమె శేరిలింగంపల్లి నియోజకవర్గం మాదాపూర్ లోని మై హోమ్ నవద్వీప గేటెడ్ కమ్యూనిటీలో నిర్వహించిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రజలందరికీ నిత్యం అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో ఆయన చిత్తశుద్ధితో పనిచేస్తారని అన్నారు. చేవెళ్లలో మరోసారి కొండా విశ్వేశ్వర రెడ్డిని గెలిపించడం ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో స్థానిక సమస్యలన్నింటికీ పరిష్కారం లభిస్తుందన్నారు.

మే 13ను హాలిడే కాకుండా పోలింగ్ డేగా భావించాలని కోరారు. ఆ రోజున ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా తరలి వచ్చి భారతీయ జనతా పార్టీకి, కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. భారత్ బలమైన దేశంగా విలసిల్లడానికి ప్రజలంతా బీజేపీని గెలిపించాలని కోరారు. మరోసారి నరేంద్ర మోడీ దేశానికి ప్రధాని కావడం ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నాయకులు ఆరు గ్యారెంటీల పేర్లు చెప్పి అధికారంలోకి వచ్చారని, కానీ ఆ గ్యారెంటీలను అమలు చేయడంలో విఫలమయ్యారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో మై హోమ్ నవద్వీప ప్రెసిడెంట్ కౌండిన్య, శిరీష, రమ, స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు, విశ్వేశ్వర్ రెడ్డి అభిమానులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed