ఐపీఎల్ టికెట్ లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్​...

by Disha Web Desk 11 |
ఐపీఎల్ టికెట్ లను బ్లాక్ లో విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులు అరెస్ట్​...
X

దిశ, శేరిలింగంపల్లి : ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో అమ్ముతున్న ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగులను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ టికెట్లను బ్లాక్ లో విక్రయిస్తున్నారన్న విశ్వసనీయ సమాచారంతో ఎస్ఓటీ మాదాపూర్ టీమ్ శుక్రవారం కొండాపూర్ లో సొంతూరి ఇస్నాపూర్ కు చెందిన మధుబాబు (30) సైనిక్ పురి డిఫెన్స్ కాలనీకి చెందిన మాథ్యూ రోడ్రిక్స్ (25), కొండాపూర్ అంజయ్య నగర్ కు చెందిన నిజంతన్ ఎలంగోవన్ (26) అనే ముగ్గురు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులను పట్టుకున్నారు. వారి నుండి సన్ రైజర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ మ్యాచ్ లకు సంబంధించిన పలు టిక్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరు ఒక్కో టిక్కెట్‌ ను రూ.10 వేల నుండి రూ.15 వేలకు బ్లాక్‌లో అక్రమంగా విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Next Story