- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొనసాగుతున్న నామినేషన్ల పర్వం
దిశ, హైదరాబాద్ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా హైదరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాలలో వివిధ పార్టీలకు అభ్యర్థుల నామినేషన్లు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మూడవ రోజు శనివారం హైదరాబాద్ లోక్ సభ స్థానానికి నాలుగు నామినేషన్లు , సికింద్రాబాద్ నియోజకవర్గానికి మూడు నామినేషన్లు దాఖలు అయ్యాయి. నోటిఫికేషన్ వెలువడిన మొదటి రోజు రెండు నియోజకవర్గాలలో నామినేషన్లు పడలేదు. రెండవ రోజు శుక్రవారం హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గం నుండి రెండు, సికింద్రాబాద్ నుండి మొత్తం ఆరుగురు నామినేషన్లను ఫైలయ్యాయి. కాగా తాజాగా నమోదైన నామినేషన్లతో ఇప్పటివరకు హైదరాబాద్ స్థానానికి మొత్తం 6 నామినేషన్లు , సికింద్రాబాద్ లో మొత్తం 9 కి చేరింది.
సికింద్రాబాద్ నుండి నమోదైన నామినేషన్లు...
1.సిద్ధిఖ్ అహ్మద్ ఖాన్ (స్వతంత్ర)
2. మహ్మద్ అబ్దుల్ అజీమ్ (స్వతంత్ర)
3. రాయపాటి సామేల్ జాన్ థామస్ (జై స్వరాజ్ పార్టీ)
హైదరాబాద్ నియోజకవర్గానికి నమోదైన నామినేషన్లు..
1. పులిపాటి రాజేష్ కుమార్ (కాంగ్రెస్)
2. సయ్యద్ జామిల్ (అలియాన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫార్మ్స్ పార్టీ )
3.ఎస్వీఎల్ సుబ్బారావు (స్వతంత్ర )
4. గడ్డం హరీష్ (ధర్మ సమాజ్ పార్టీ )