రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని గెలిపించండి

by Disha Web Desk 15 |
రానున్న పార్లమెంటు ఎన్నికల్లో లక్ష్మారెడ్డిని గెలిపించండి
X

దిశ, ఎల్బీనగర్ : త్వరలో జరగనున్న మల్కాజ్​గిరి పార్లమెంట్ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ని గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మన్సురాబాద్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మార్నింగ్ వాక్ లో భాగంగా శుక్రవారం మనసురాబాద్ డివిజన్ పరిధిలోని హరిణ వనస్థలిలో పలువురు వాకర్ సభ్యులను మర్యాదపూర్వకంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, బీఆర్​ఎస్​ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కలిశారు. ఈ సందర్భంగా సుధీర్ రెడ్డి మాట్లాడుతూ నగరంలో ఎ నియోజకవర్గంలో లేనటువంటి పార్కులు వనస్థలిపురంలో నే ఉన్నాయని, ఇట్టి పార్కులను అభివృద్ధి చేసింది తానేనని తెలిపారు. అలాగే పార్కులలో ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేశామని వెల్లడించారు.

ఇంకా కొన్ని పార్కులలో అక్కడక్కడా సమస్యలు ఉన్నాయని, వాటిని కూడా త్వరలోనే పరిష్కరిస్తానని ఆయన హామీ ఇచ్చారు. నాగోల్ నుండి ఎల్బీనగర్ వరకు, ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ వరకు మెట్రో నిర్మాణం పూర్తి చేసే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు. తన మీద చూపించిన సానుభూతిని రాగిడి లక్ష్మారెడ్డిపై చూపాలని కోరారు. మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిరి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, రాబోయే రోజుల్లో తప్పకుండా

బీఆర్​ఎస్​ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమీ లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జి ముద్ద గౌని రామ్మోహన్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు కొప్పుల విట్టల్ రెడ్డి, అనంతుల రాజు రెడ్డి కౌన్, జక్కిరి మల్లారెడ్డి, చెరుకు ప్రశాంత్ గౌడ్, మహిళా అధ్యక్షురాలు ప్రమీల జగదీష్ యాదవ్, సతీష్ యాదవ్, భాస్కర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story