సీఎం ఇస్తానన్న 2500 లకే దిక్కులేదు.. రాహుల్ గాంధీ లక్ష ఇస్తానంటే నమ్మాలా: గాదరి కిషోర్

by Disha Web Desk 12 |
సీఎం ఇస్తానన్న 2500 లకే దిక్కులేదు.. రాహుల్ గాంధీ లక్ష ఇస్తానంటే నమ్మాలా: గాదరి కిషోర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇటీవల కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన జాతీయ మేనిఫెస్టోపై తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో విచిత్రంగా ఉందని, సొంత పార్టీలోనే ఏక నిర్ణయం లేని మేనిఫోస్టో అని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ ఆయన మీడియా సమావేశం నిర్వహించి ఇలా అన్నారు. రాహుల్ గాంధీ ప్రతి మహిళకు లక్ష రూపాయలు ఇస్తాను అంటాడు. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రతి మహిళకు 2500 ఇస్తాను అంటాడు. ప్రస్తుతం రాష్ట్రంలో రేవంత్ ఇస్తానన్న 2500 కే దిక్కులేదు. కానీ రాహుల్ గాంధీ ఏకంగా లక్ష ఇస్తా అని మాట్లాడుతున్నాడు ఇది సాధ్యమేనా అని మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ ప్రశ్నించారు. అలాగే కాంగ్రెస్ మేనిఫెస్టో మొత్తం అబద్ధాలు మోసపూరిత వాగ్దానాలు ఉన్నాయని.. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితి లేదని.. అర్థమైందని.. అందుకే తప్పుడు వాగ్దానాలతో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ను తయారు చేసిందన్నారు. అలాగే గడిచిన 100 రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తమ పాలనలో ఫెయిల్ అయిందని.. నీటి సమస్యలకు కారణమైన ఆ పార్టీకి ప్రజలు, రైతులు ఈ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని చెప్పుకొచ్చాడు


Next Story