సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
సోనియమ్మ తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం: జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీభవన్‌లో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ దేశానికి అన్నీ చేసిన రాహుల్ గాంధీ కుటుంబాన్ని బీజేపీ, బీఆర్ఎస్‌ నేతలు నిందిస్తున్నారని మండిపడ్డారు. దేశానికి కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ ప్రత్యేక తెలంగాణ ఇచ్చారు కాబట్టే.. కేసీఆర్ సీఎం అయ్యాడని, సమైక్య రాష్ట్రానికి కేసీఆర్ సీఎం అయ్యేవాడా అని ప్రశ్నించారు. ఇందిరా గాంధీ స్వాతంత్ర్య ఉద్యమంలో ఆరేళ్ల జైలు శిక్ష అనుభవించారని గుర్తు చేశారు. స్వాతంత్ర కోసం జైలుకెళ్లినట్లు ఏ బీజేపీ నేతకు అయిన చరిత్ర ఉందా నిలదీశారు. ఇందిరమ్మకు ఉన్న చరిత్ర ప్రధాని మోడీ, అమిత్ షాకు ఉందా అని అన్నారు. బీజేపీ దేవుళ్లు, మతం పేరుతో విభజన రాజకీయాలు చేస్తోందని దుయ్యబట్టారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం సురక్షితంగా ఉంటుందన్నారు.



Next Story

Most Viewed