- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు అస్వస్థత!
దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ, షుగర్ లెవల్స్ డౌన్ కావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, మాదిగలకు ఇంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని, మనసు మార్చుకొని మాదిగలకు రెండు ఎంపీ సీట్లు కేటాయించాలని మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం దీక్ష చేపట్టిన ఆయన నిన్న దీక్షను విరమింపజేశాడు. మాదిగల కోసం దీక్ష చేశానని పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీక్ష వల్లే ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యపరిస్థితిపై వివరాలు వెల్లడిస్తామని అన్నారు.