మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు అస్వస్థత!

by Disha Web Desk 5 |
మాజీమంత్రి మోత్కుపల్లి నర్సింహులుకు అస్వస్థత!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకులు మోత్కుపల్లి నర్సింహులు అస్వస్థతకు గురయ్యారు. అకస్మాత్తుగా బీపీ, షుగర్ లెవల్స్ డౌన్ కావడంతో కుటుంబసభ్యులు ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆయన బేగంపేటలోని వెల్నెస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. అకస్మాత్తుగా అస్వస్థతకు గురి కావడంతో ఆయన ఆరోగ్యంపై కుటుంబసభ్యులు ఆందోళన చెందుతున్నారు. కాగా మాదిగలకు కాంగ్రెస్ పార్టీ తీవ్ర అన్యాయం చేసిందని, మాదిగలకు ఇంతటి అన్యాయం మునుపెన్నడూ జరగలేదని, మనసు మార్చుకొని మాదిగలకు రెండు ఎంపీ సీట్లు కేటాయించాలని మోత్కుపల్లి నర్సింహులు బేగంపేటలోని తన నివాసంలో ఒక రోజు దీక్ష చేపట్టారు. ఈ మేరకు రెండు రోజుల క్రితం దీక్ష చేపట్టిన ఆయన నిన్న దీక్షను విరమింపజేశాడు. మాదిగల కోసం దీక్ష చేశానని పార్టీ మారే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. దీక్ష వల్లే ఆయన అస్వస్థతకు గురై ఉండొచ్చని వైద్యులు అనుమానం వ్యక్తం చేశారు. పరీక్షల అనంతరం ఆయన ఆరోగ్యపరిస్థితిపై వివరాలు వెల్లడిస్తామని అన్నారు.

Next Story

Most Viewed