- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ గుడ్ న్యూస్!
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో పదో తరగతి ఫలితాలపై విద్యాశాఖ కీలక ప్రకటన చేసింది. ఇవ్వాళ ఇంటర్మీడియట్ ఫలితాలు వెల్లడించిన విద్యాశాఖ పదో తరగతి ఫలితాలు విడుదలకు రంగం సిద్దం చేసింది. ఈ మేరకు ఈ నెల 30 తేదీన ఫలితాలు విడుదల చేయాలని విద్యాశాఖ అధికారులు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఏప్రిల్ 30న ఉదయం 11 గంటలకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పది ఫలితాలను విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు రాసి ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 5 లక్షల మంది విద్యార్ధులకు గుడ్ న్యూస్ చెబుతూ.. విద్యాశాఖ ఈ ప్రకటన చేసింది. కాగా తెలంగాణలో మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు పదో తరగతి పరీక్షలు జరగగా.. ఏప్రిల్ 3 నుంచి స్పాట్ వాల్యూయేషన్ ను ప్రారంభించారు. ఈ స్పాట్ వాల్యూయేషన్ 19 కేంద్రాల్లో ఈ నెల 13 వరకు జరగగా.. ఏప్రిల్ 30న ఫలితాలు విడదల చేసేందుకు అధికారులు కసరత్తులు పూర్తి చేశారు.