- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
CONGRESS: దానం నాగేందర్పై ఏఐసీసీ గుస్సా..! ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ససేమిరా.. మళ్లీ తెరపైకి ‘బొంతు’
దిశ, వెబ్డెస్క్: లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండటంతో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థుల ఎంపికలో ఆటుపోట్లు తగుతున్నాయి. ఇప్పటికే పలు ఎంపీ స్థానాలకు గాను టికెట్ ఆశించి భంగపడిన నాయకులు తమ అసంతృప్తిని బాహాటంగానే వ్యక్తపరుస్తున్నారు. అదేవిధంగా ఇటీవలే పార్టీలోకి వలస వచ్చిన నేతలు సైతం ఏఐసీసీకి ఝలక్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవలే బీఆర్ఎస్ను కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్ అధిష్టానానికి షాక్ ఇచ్చినట్లుగా సమాచారం. సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతో పార్టీలో చేరిన ఆయన ప్రస్తుతం ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు ఒప్పుకోవడం లేదని తెలుస్తోంది. అయితే, రాజీనామా చేస్తేనే ఎంపీ టికెట్ ఇస్తామని దానంకు పార్టీలో చేరే ముందు ఏఐసీసీ చెప్పినా.. ఇప్పుడు అప్పుడు అంగీకరించపోవడం ఏఐసీసీకి కోపం తెప్పించినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిని మార్చే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. అయితే, ఇప్పటికే సికింద్రాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి టికెట్ ఆశిస్తున్న బొంతు రామ్మోహన్ పేరును మరోసారి ఏఐసీసీ పరిశీలిస్తోందనే టాక్ వినిపిస్తోంది.