Eatala Rajender : ఎంపీగా పోటీ.. ఈటల రాజేందర్ క్లారిటీ!

by Disha Web Desk 4 |
Eatala Rajender : ఎంపీగా పోటీ.. ఈటల రాజేందర్ క్లారిటీ!
X

దిశ, వెబ్‌డెస్క్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీపై హుజురాబాద్ మాజీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ క్లారిటీ ఇచ్చారు. బుధవారం హన్మకొండ జిల్లా కమలాపూర్‌లో పర్యటించిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీ ఆదేశిస్తే పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేస్తా అన్నారు. పోటీ ఎక్కడి నుంచి అనేది అధిష్టానమే నిర్ణయిస్తుందన్నారు. హుజురాబాద్ ఉప ఎన్నికల తర్వాత తన నియోజకవర్గంపై కేసీఆర్ పగబట్టారన్నారు. ఎమ్మెల్యే హక్కులను హరించి తనను శాసనసభ్యుడిగా బాధ్యతలు నిర్వహించకుండా చేశారన్నారు. ఉపఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టారని కేసీఆర్‌పై మండి పడ్డారు. డ్రామాలు చేసి హుజురాబాద్‌లో బీఆర్ఎస్ గెలిచిందన్నారు.


Next Story