హామీలతో కాలక్షేపం.. భట్టి విక్రమార్క

by Dishafeatures2 |
హామీలతో కాలక్షేపం.. భట్టి విక్రమార్క
X

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రభుత్వ కేవలం హామీలతోనే కాలక్షేపం చేస్తున్నదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం అసెంబ్లీ మీడియా పాయింట్​ వద్ద భట్టి మాట్లాడుతూ..బీఆర్ఎస్‌ గొప్పలు చెప్పుకోవడం తప్ప బడ్జెట్‌లో ఏమీ లేదన్నారు. తెలంగాణ బడ్జెట్‌తో బలహీన వర్గాలకు ఒరిగిందేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్‌ బెడ్రూమ్ ఇళ్లు, ఇళ్ల స్థలాలు, రుణ మాఫీ ఏమైంది? అని ఆయన ప్రశ్నించారు. హరీష్‌రావు అంకెల గారడి, మాయమాటలు తప్ప బడ్జెట్‌లో ఏమీ కనిపించలేదని విమర్శించారు. గత బడ్జెట్ హామీలే ఇప్పటికీ అమలు కాలేదని భట్టి విక్రమార్క గుర్తుచేశారు. ప్రజలను మరోసారి మోసం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. హామీలతోనే కేసీఆర్‌ ప్రభుత్వం కాలం వెళ్లదీస్తోందన్నారు. త్వరలో బీఆర్​ఎస్ ​ప్రభుత్వానికి బుద్ది చెప్పే రోజులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు.


Next Story

Most Viewed