BRS పనైపోయింది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

by Disha Web Desk 4 |
BRS పనైపోయింది.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పనైపోయిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేటలో ఆయన మీడియాతో మాట్లాడారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ మనుగడ ప్రశ్నార్థకమే అని ఉత్తమ్ తెలిపారు. తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో మోడీకి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ 13 నుంచి 14 స్థానాలు గెలుస్తుందని ఉత్తమ్ జోస్యం చెప్పారు. నల్గొండ స్థానంలో కాంగ్రెస్ దేశంలోనే అధిక మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.


Next Story