BREAKING: అతి తక్కువ సమయంలో కూలిపోతున్న బీఆర్ఎస్ పార్టీ: స్టేట్ బీజేపీ చీఫ్ కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
Kishan Reddy Urges CM KCR to allot land for Ramagundam ESI Hospital
X

దిశ, వెబ్‌డెస్క్: అతి తక్కువ సమయంలోనే బీఆర్ఎస్ పార్టీ కూలి కనుమరుగు కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్లు అధికారంలో ఉండి రూ.లక్షల కోట్లు దోచుకున్న బీఆర్ఎస్ పార్టీని ప్రజలు పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల్లో ఓడినా.. కేటీఆర్ తానే సీఎం అయినట్లుగా అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు. విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లి, మూడో‌సారి కూడా గెలిచి సీఎం అవుదామని అనుకున్న కేటీఆర్ కలలు.. కల్లలుగానే మిగిలాయని అన్నారు. కేవలం ఆ విషయంలోనే ఆయన బాధపడుతున్నారని, రాష్ట్రంలో సాగునీరు లేక పంటలు ఎండినందుకు కాదని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ వల్లే రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందంటూ కిషన్‌రెడ్డి ఫైర్ అయ్యారు.



Next Story