MP ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం

by Disha Web Desk 4 |
MP ఎన్నికల వేళ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సంచలన నిర్ణయం
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు కీలక నిర్ణయం తీసుకున్నారు. మెదక్ పార్లమెంట్‌కు కేంద్రం ఇచ్చిన నిధులపై పుస్తకాన్ని ఆయన హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో విడుదల చేశారు. కేంద్ర నిధులపై సీఎం రేవంత్ రెడ్డి, సీఎస్ శాంతికుమారికి పోస్టులో పుస్తకం పంపనున్నట్లు తెలిపారు. రెండు పడక ఇళ్లు, రోడ్లు, ఉపాధి, నిధులకు సంబంధించిన వివరాలు పుస్తకంలో ఉన్నట్లు ఆయన తెలిపారు. పల్లె ప్రకృతి వనాలకు రూ.4.23లక్షల చొప్పున అందజేశామన్నారు. రైతు వేదికలకు రూ.10 లక్షల చొప్పున నిధులు అందజేశామన్నారు. వైకుంఠధామాలకు రూ.11.13లక్షల చొప్పున అందజేశామన్నారు. దుబ్బాక స్థానంలోనే ఉపాధి కూలీలకు రూ.230 కోట్లు నిధులు ఇచ్చామన్నారు. డంపు యార్డులకు రూ.2.5 లక్షల చొప్పున అందజేశామన్నారు. కొడంగల్ లో ప్రతి పంచాయతీ వివరాలు కూడా పంపుతామని తెలిపారు.



Next Story

Most Viewed