- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒక్కటే: మహేష్ కుమార్ గౌడ్
దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం పైసలు కోసం పేపర్లు అమ్ముకుంటుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు. ప్రభుత్వంలో విచిత్ర వైఖరి నెలకొన్నదన్నారు. విచ్చలవిడి నిర్లక్ష్యంతో సర్కార్ కొనసాగుతుందని ఆయన సోమవారం మీడియాకు తెలిపారు. విద్యార్ధులు, నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడుతుందన్నారు. టీఎస్పీఎస్సీ లీకేజ్ అంశం మరువకముందే.. టెన్త్ప్రశ్న పత్రం లీక్ కావడం ఆందోళన కలిగించే అంశమన్నారు. ప్రభుత్వానికి పాలనపై అవగాహన లేదన్నారు. లక్షల మంది నిరుద్యోగులు, విద్యార్ధుల జీవితాలతో సర్కార్ చెలగాటమాడుతుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ అట్టడుగుకు వెళ్లిందన్నారు.
లాభాల కోసం పేపర్లు అమ్మడాన్ని చరిత్రలో చూడలేదన్నారు. కేసీఆర్ఫ్యామిలీ రాష్ట్రాన్ని అమ్మేసేందుకు ప్రయత్నాలు చేస్తుందన్నారు. పేపర్లీకేజ్లపై కాంగ్రెస్పార్టీ సంపూర్ణంగా పోరాడుతుందన్నారు. విద్యార్ధులు, నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు వెనకడుగు వేయమని ఆయన నొక్కి చెప్పారు. పేపర్లీకేజీలపై వెంటనే సీబీఐ, సిట్టింగ్ జడ్జిలతో ఎంక్వైరీ చేయించాలని కోరారు. ఇక బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండూ ఒకటేనని మహేష్కుమార్గౌడ్మరోసారి స్పష్టంచేశారు. ఒకరికొకరు సపోర్టు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు. ఆ రెండు పార్టీలను ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదని, రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్విజయ శంఖాన్ని మోగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.