- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాక్షసులను రామభక్తులుగా మార్చిన ఘనత బీజేపీదే: బండి సంజయ్
దిశ, వెబ్డెస్క్: కాంగ్రెస్ నాయకులు కూడా తాము రామ భక్తులం అంటున్నారంటే అది బీజేపీ గొప్పతనమని.. రాక్షసులను రామ భక్తులుగా మార్చిన ఘనత బీజేపీదేనని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా శనివారం కరీంనగర్ సెగ్మెంట్ పరిధిలో బండి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఇతర పార్టీల నుండి బీజేపీలోకి ఎవరూ వచ్చిన రాజీనామా చేసి రావాలని కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మూడో స్థానానికే పరిమితం అవుతోందని ఆయన జోస్యం చెప్పారు. తెలంగాణలో మాకు ప్రధాన పోటీ కాంగ్రెస్ పార్టీతోనేనని స్పష్టం చేశారు. కరీంనగర్లో తనను ఓడించడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒక్కటి అయ్యాయని ఆరోపించారు. నామినేషన్ల పక్రియ ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీకి ఇంకా అభ్యర్థులు దొరకడం లేదని బండి సెటైర్ వేశారు.