అసదుద్దీన్ ఓవైసీ వెంటనే క్షమాపణ చెప్పాలి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్

by Disha Web Desk 5 |
అసదుద్దీన్ ఓవైసీ వెంటనే క్షమాపణ చెప్పాలి.. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్ధి అసదుద్దీన్ ఓవైసీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. అసదుద్దీన్ ఇలా చేస్తున్నా ఎన్నికల కమిషన్ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిన్న అసదుద్దీన్ ఓవైసీ పార్టీ ప్రచారం చేసుకుంటూ ఓ బీఫ్ షాప్ లోకి వెళ్లి కోయండి.. కోస్తూనే ఉండండి.. తినండి అని మాట్లాడుతున్నారని, అదే విధంగా నేను కూడా ఒక పందిని కోసే షాప్ లోకి వెళ్లి అదే కామెంట్ చేస్తే.. ముస్లింల మనోభావాలు దెబ్బతీస్తున్న రాజాసింగ్ అని ఏడ్చే వాడివని ఆగ్రహం వ్యక్తం చేశారు.

యావత్ భారతదేశంలో 100 కోట్ల మంది హిందువుల గోమాతను తమ తల్లిలాగా చూసి దేవుడిలా పూజిస్తారని అన్నారు. కానీ నువ్వు ఇలాంటి కామెంట్లు చేసి ఓటు బ్యాంకు రాజకీయం ఆడుతున్నావని, చీప్ రాజకీయాలు చేస్తున్నావని మండిపడ్డారు. మరి అసదుద్దీన్ ఇలాంటి కామెంట్లు చేస్తుంటే ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుందని, పోలీసులు సుమోటో కేసు బుక్ చేయోచ్చు కదా అని ప్రశ్నించారు. కానీ పోలీసులు అలా చేయరని, ఎందుకంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అసదుద్దీన్ కి సపోర్టుగా ఉంటే.. పోలీసులు కూడా ఉండాలి కదా! ప్రతీసారి ఇలాగే అవుతుందని అన్నారు. అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్ కేసు బుక్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నానని, అలాగే ఆయన వ్యాఖ్యలపై క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Next Story

Most Viewed