- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మునుగోడు 'బహిరంగ సభ' ఇన్చార్జీల నియామకం
దిశ, తెలంగాణ బ్యూరో : కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈనెల 21న మునుగోడులో జరిగే బహిరంగ సభకు హాజరు కానున్నారు. ఈ సభలోనే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో చేరనున్నారు. ఈ నేపథ్యంలో జన సమీకరణ, ఇతర ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ఒక్కో మండలానికి ఇద్దరు సీనియర్ నేతల చొప్పున ఇన్ చార్జీలను నియమించారు. కొత్తగా ఏర్పాటైన గట్టుప్పల్ మండలం సహా మiనుగోడు నియోజకవర్గంలోని మొత్తం 9 మండలాలకు 18 మంది సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలు అప్పగించారు.
ఇన్ చార్జీలు వీరే..
చౌటుప్పల్ రూరల్ మండలానికి బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఏపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, చౌటుప్పల్ మున్సిపాలిటీకి జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్ రావు, ఏనుగు రవీందర్ రెడ్డి, మునుగోడుకు జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సంస్థాన్ నారాయణపురం మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్, మాజీ ఎంపీ రవీంద్ర నాయక్, చండూరుకు : మాజీ ఎంపీ చాడా సురేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, చండూరు మున్సిపాలిటీకి ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ ఎమ్మెల్యే విజయపాల్ రెడ్డి, గట్టుప్పల్ మండలానికి ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మర్రిగూడెంకు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆచారి, నాంపల్లికి మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే ధర్మారావును నియమించారు.