BRSకు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక నేత భేటీ

by Disha Web Desk 4 |
BRSకు మరో షాక్.. సీఎం రేవంత్ రెడ్డితో కీలక నేత భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ వలసలు బీఆర్ఎస్ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ముఖ్యనేతలు, సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇక, తాజాగా శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ కీలక నేత మదన్ రెడ్డి మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ముఖ్యమంత్రితో మదన్ రెడ్డి సమావేశం అయిన సమయంలో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్, నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఆవుల రాజిరెడ్డితో పాటు నర్సాపూర్ కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు. పార్టీలో వలసలు ఊపందుకున్న వేళ ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


Next Story