ఈ దేశాన్ని అందంగా ముస్తాబు చేసిన వాళ్లం.. మోడీ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ కౌంటర్

by Disha Web Desk 4 |
ఈ దేశాన్ని అందంగా ముస్తాబు చేసిన వాళ్లం.. మోడీ వ్యాఖ్యలకు అక్బరుద్దీన్ కౌంటర్
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ ఎన్నికల వేళ ప్రధాని మోడీ ముస్లింలపై చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా దుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా, ఎంఐఎం కీలక నేత అక్బరుద్దీన్ ప్రధాని మోడీ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు. హైదరాబాద్‌లో నిర్వహించిన ఓ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తాము దేశంలోకి చొరబడి ఎక్కువ పిల్లలను కంటున్నామా..? అని ప్రశ్నించారు. భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయ్‌కి ఏడుగురు, అమిత్ షాకు ఏడుగురు, నరేంద్ర మోడీకి ఆరుగురు సోదర సోదరమణిలు ఉన్నారన్నారు. తాము దేశానికి తాజ్ మహల్, కుతుబ్ మినార్, రెడ్ ఫోర్ట్, జామా మజీద్, చార్మినార్ వంటి కట్టడాలను ఇచ్చి.. ఈ దేశాన్ని అందంగా డెకరేట్ చేశామన్నారు. తాము చొరబాటు దారులం కాదన్నారు. తాము ఈ దేశానికి చెందిన వాళ్లమే అని.. ఈ దేశం ఎప్పటికి తమదే అని అక్బరుద్దీన్ అన్నారు.



Next Story

Most Viewed