- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దళితుల హక్కుల సాధన కోసం పోరాటానికి సిద్ధం కావాలి
దిశ,నస్పూర్ : దళితుల హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని మాదిగ హక్కుల దండోరా రాష్ట్ర అధ్యక్షుడు రేగుంట సునీల్ అన్నారు. శుక్రవారం నస్పూర్ పట్టణంలోని సీసీ సెంటర్ లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఆయన పాలాభిషేకం చేసి పూలమాలలు సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో వెనుకబడ్డ మాదిగలు, అణగారిన వర్గాల ప్రజల త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డ స్వరాష్ట్రంలో మరింత అనగదొక్కబడుతున్నారని, దళితులను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం పై ఉన్నదని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో దళితుల పాత్ర మరువలేనిదని, అలాంటి దళితులకు అడుగడుగునా అన్యాయమే జరుగుతుందని, దగా పడిన దళితుల హక్కుల సాధన కోసం మరో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంహెచ్డీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు కడారి రమేష్, నస్పూర్ పట్టణ అధ్యక్షుడు అటుకపురం సమ్మయ్య, నాయకులు కొండ్ర లింగయ్య, రేగుంట లింగయ్య,కొండ్ర ఉదయ్, అటుకపురం రాజలింగు పాల్గొన్నారు.