గులాబీ గూటికి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్

by Disha Web Desk 23 |
గులాబీ గూటికి ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్
X

దిశ,ఆదిలాబాద్ : తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనంతరం పార్టీ మారిన ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ తిరిగి గులాబీ గూటికి చేరాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేసిన.. జనార్దన్ రాథోడ్ కు అవకాశాలు అంతగా కలిసి రాలేదు. దీంతో ఆదిలాబాద్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల శంకర్ సమక్షంలో బీజేపీలో చేరారు. గత కొన్ని రోజులుగా బీజేపీలో కూడా సరైన గుర్తింపు లేకపోవడంతో రాథోడ్ జనార్ధన్ తిరిగి గులాబీ పార్టీలోకి చేరాడు. మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని గాయత్రి గార్డెన్ లో పార్లమెంట్ ఎన్నికల బూత్ స్థాయి నాయకులతో జరిగిన సమావేశంలో పార్టీ తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ కండువా వేసుకున్నారు. జడ్పీ చైర్మన్ తిరిగి బీఆర్ఎస్ లో చేరడంతో బీజేపీకి షాక్ తగిలింది. రెండు రోజుల వ్యవధిలోనే బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరగా,ఇదే పార్టీ నుంచి జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ సొంత గూటికి చేరారు.


Next Story