హైదరాబాద్‌లో అరుదైన సీన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడిదే ట్రెండింగ్ (వీడియో)

by Disha Web Desk 2 |
హైదరాబాద్‌లో అరుదైన సీన్.. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పుడిదే ట్రెండింగ్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున అరుదైన దృశ్యం ఆవిష్కృతం అయింది. నగరంలోని హైటెక్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఓ రైతు అందరి దృష్టిని ఆకర్షించారు. అంటే ఆయనేదో వింత చేశాడనుకోకండి. ప్రపంచంతో పోటీ పడుతున్న మన ప్రధాన నగరంలో ఎండ్లబండిపై తిరిగాడు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఆగిన సమయంలో కొందరు ఆయన్ను ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ పోస్టు కాస్త వైరల్ అయి.. ప్రస్తుతం ట్రెడింగ్‌లోకి వచ్చింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతున్నారు. ఒకరు ‘రాజు ఎక్కడున్నా.. రాజే రా’ అని కామెంట్ పెట్టగా.. ఐటీ పార్కు వద్దకు రైతు పోలేదు.. రైతు వద్దకే ఐటీ పార్కు వచ్చింది ఒకరు.. రైతు ఎంట్రీతో సైబర్ టవర్‌కే అందం వచ్చిందని మరికొందరు కామెంట్లతో రెచ్చిపోయారు. ఏది ఏమైనా బెంజ్, ఆడి తిరిగే రోడ్లపై ఎడ్లబండి దర్శనమివ్వడం గొప్ప విషయమని మరికొందరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



Next Story

Most Viewed