కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి

by Disha Web Desk 4 |
కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి
X

దిశ, శంషాబాద్ : కాంగ్రెస్ పార్టీ అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిందని బిజెపి చేవెళ్ల ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా రాజేంద్రనగర్ నియోజకవర్గం బిజెపి కంటెస్ట్‌డ్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్పోరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డితో కలిసి శనివారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం నర్కుడ, చౌదరి గూడలో ఇంటింటికి తిరుగుతూ బిజెపి పార్టీ కమలం గుర్తుకు ఓటు వేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఏ గ్రామం వెళ్లిన ప్రతి ఒక్కరు మోడీ మోడీ అంటున్నారన్నారు. పది సంవత్సరాల్లో నరేంద్ర మోడీ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిందని ఏ ఒక్క ఆమెను కూడా నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూనే ఉందన్నారు. కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలకు చెప్పుకోవడానికి ఏమి లేకపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు.

ఎంతమంది కాంగ్రెస్ నాయకులు వచ్చిన చేవెళ్ల గడ్డపై బీజేపీ జెండా ఎగరడాన్ని ఎవరు ఆపలేరు అన్నారు. గత పదేళ్లుగా రాష్ట్రంలో కుటుంబ పాలనతోనే తెలంగాణ ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారని, అది మరవకముందే ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిందన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను తెలంగాణ ప్రజలు ఈ పార్లమెంటు ఎన్నికల్లో పూర్తిగా తిరస్కరించడం ఖాయమన్నారు. దేశ ప్రధానిగా హ్యాట్రిక్ సాధించి మరోసారి నరేంద్ర మోడీ ప్రధాని కావడం ఖాయం అన్నారు. ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు డాక్టర్ ప్రేమ్ రాజ్, బొడిగె శోభ, బుక్క వేణుగోపాల్,నాయకులు కుమార్ యాదవ్, దేవేందర్, చిటికెల వెంకటయ్య, బుక్క ప్రవీణ్,సునిగంటి సిద్దులు, నాగేష్ గౌడ్, కిట్టు ముదిరాజ్, బుర్కుంట గోపాల్, సంజీవ, మహేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed