రూ.10 వేలకే 108 MP కెమెరాతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌

by Disha Web Desk 17 |
రూ.10 వేలకే 108 MP కెమెరాతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌
X

దిశ, టెక్నాలజీ: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ Itel ఇండియాలో కొత్త మోడల్‌ను విడుదల చేసింది. దీనిపేరు ‘Itel S24’. ఇది భారీ బ్యాటరీతో వచ్చింది. వినియోగదారుల కోసం పెద్ద కెమెరాను అందించారు. ఫోన్ 8GB RAM+128 స్టోరేజ్ వేరియంట్ ధర రూ.9,999. ఈ కామర్స్ అమెజాన్‌లో అమ్మకానికి ఉంది. కొనుగోలు సమయంలో రూ.999 విలువగల Itel 42 స్మార్ట్‌వాచ్‌ని ఉచితంగా పొందవచ్చు. రిటైల్ అవుట్‌లెట్లలో మాత్రం ఏప్రిల్ చివరి వారంలో అందుబాటులో ఉంటుంది.


Itel S24 స్పెసిఫికేషన్స్

* 6.6-అంగుళాల HD+ (720x1,612 పిక్సెల్‌లు) స్క్రీన్‌.

* ఆండ్రాయిడ్ 13-ఆధారిత Itel OS 13 పై రన్ అవుతుంది.

* MediaTek Helio G91 SoC ద్వారా పనిచేస్తుంది.

* 108-MP Samsung HM6 కెమెరా ఉంది.

* ముందు సెల్ఫీల కోసం 8MP కెమోరాను అందించారు.

* ముందు కెమెరా చుట్టూ బ్యాటరీ చార్జింగ్, నోటిఫికేషన్‌లు కనిపిస్తాయి.

* సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ ఉంది.

* దీనిలో 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్‌తో 5,000mAh బ్యాటరీని అందించారు.



Next Story

Most Viewed