నాలుగు ఓటముల తర్వాత వైశాలికో విజయం

by Dishanational3 |
నాలుగు ఓటముల తర్వాత వైశాలికో విజయం
X

దిశ, స్పోర్ట్స్ : కెనడాలో జరుగుతున్న క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్‌.వైశాలి వరుస పరాజయాలకు చెక్ పెట్టింది. మంగళవారం 10వ రౌండ్‌లో విజయం సాధించింది. బల్గేరియా క్రీడాకారిణి నూర్గ్యుల్ సాలిమోవా‌ను ఓడించింది. ప్రత్యర్థి నుంచి తీవ్ర పోటీ ఎదుర్కొన్న ఆమె 88 ఎత్తుల్లో పైచేయి సాధించింది. టోర్నీలో ఆమెకు ఇది రెండో విజయం. తొలి విజయం సాధించిన నూర్గ్యుల్ సాలిమోవాపైనే తిరిగి పుంజుకోవడం గమనార్హం. మరో గేమ్‌లో అగ్రస్థానంలో ఉన్న టాన్ ఝోంగి(చైనా)తో కలిసి భారత అగ్రశ్రేణి క్రీడాకారిణి కోనేరు హంపి డ్రా చేసుకుంది. ఆమెకు ఇది వరుసగా రెండో డ్రా. మరోవైపు, పురుషుల విభాగంలో భారత క్రీడాకారులు 10వ రౌండ్‌ను డ్రాతో ముగించారు. ప్రజ్ఞానంద, విదిత్ గుజరాతితో డ్రా చేసుకున్నాడు. మరో గేమ్‌లో గుకేశ్.. రష్యా ప్లేయర్ ఇయాన్ నెపోమ్నియాచ్చితో 40 ఎత్తుల్లో పాయింట్లు పంచుకున్నాడు. పాయింట్స్ టేబుల్‌లో ఇయాన్ నెపోమ్నియాచ్చితో కలిసి గుకేశ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.


Next Story