- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మునుగోడులో ఊహించని ట్విస్ట్.. KCRతో CPI నేతల భేటీ!
దిశ, వెబ్డెస్క్: మునుగోడు ఉప ఎన్నికను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దుబ్బాక, హుజురాబాద్ బైపోల్లో గెలచి మాంచి ఊపుమీద ఉన్న బీజేపీకి ఎలాగైనా చెక్ పెట్టాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఇప్పటికే బీజేపీని ఓడించే పార్టీకి మద్దతిస్తామని కమ్యూనిస్టులు ప్రకటించగా.. తమతో కలిసి రావాలని కేసీఆర్ కోరినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రగతిభవన్లో సీపీఐ నేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డితో కేసీఆర్ దాదాపు రెండు గంటల పాటు కీలక చర్చలు జరిపారు. తెలంగాణలో ఏ ఎన్నికలు జరిగినా తమకు మద్దతు ఇవ్వాలని కేసీఆర్ కోరారు. దీనికి స్పందించిన సీపీఐ నేతలు మునుగోడు బైపోల్లో సపోర్ట్ చేస్తామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. దీనిపై ఇవాళ మునుగోడులో నిర్వహించే బహిరంగ సభలో కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు. అంతేగాక, ఈ సభలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు పల్లా వెంకట్ రెడ్డి పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా, ఇప్పటికే కమ్యూనిస్టులతో కలిసి పోవాలని భావించిన రేవంత్ రెడ్డి ఊహించని ట్విస్ట్ ఇచ్చినట్లు అయింది. దీనిపై కాంగ్రెస్ ఏ విధంగా స్పందిస్తుందో తెలియాల్సి ఉంది.