- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
X
దిశ, హుజురాబాద్: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా హుజూరాబాద్ లో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. ఈ క్రమంలో ఆకునూరు దగ్గర రోడ్డు తెగిపోయింది. దీంతో వాగు దాడటానికి తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ క్రమంలో పోలీసులు స్పందించి ఓ వ్యక్తి మృతదేహాన్ని ఆ వాగు దాటించారు.
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన బత్తుల పోచయ్య అనారోగ్యంతో వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో చనిపోవడంతో సొంత ఊరు గొల్ల గూడెం తీసుకొస్తున్న సమయంలో ఆకునూరు దగ్గర రోడ్డు తెగిపోవడంతో శవాన్ని దాటించడానికి ఇబ్బంది ఏర్పడింది. ఈ క్రమంలో స్థానిక ఎస్సై ప్రశాంత్ రావుకు ఫోన్ చేశారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటిన సిబ్బందితో అక్కడికి చేరుకుని తాళ్ల సాయంతో శవాన్ని వాగు దాటించారు. దీంతో ఆ ఎస్సైని, పోలీస్ సిబ్బందిని ఆ గ్రామప్రజలు అభినందించారు.
Next Story