- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దిశ, శంకర్పల్లి: ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతన అలవర్చుకోవాలని శంకర్పల్లి పీఏసీఎస్ చైర్మన్ బద్దం శశిధర్ రెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మున్సిపాలిటీలోని 14వ వార్డులో ఏర్పాటు చేసిన దేవీ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదానం కౌన్సిలర్ జూలకంటి శ్వేతాపాండురంగారెడ్డి, టీఆర్ఎస్ మున్సిపల్ యూత్ ప్రెసిడెంట్ పాండురంగారెడ్డిల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతంలో దసరా ఉత్సవాలు ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకుంటారని, అదేవిధంగా సామూహికంగా బతుకమ్మ ఊరేగింపును ఘనంగా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శంకర్పల్లి మున్సిపాలిటీ టీఆర్ఎస్ ప్రెసిడెంట్ వాసుదేవ్ కన్నా, కాశెట్టి మోహన్, పార్సీ బాలకృష్ణ, సోషల్ మీడియా చైర్మన్ రఘునందన్ రెడ్డి, వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీకాంత్, ప్రశాంత్ రెడ్డి, భాస్కర్ రెడ్డి పాల్గొన్నారు.