‘జాతిరత్నాలు’ మించిన కామెడీ డోస్‌తో నవీన్ పొలిశెట్టి

by  |
‘జాతిరత్నాలు’ మించిన కామెడీ డోస్‌తో నవీన్ పొలిశెట్టి
X

దిశ, సినిమా : యంగ్ హీరో నవీన్ పొలిశెట్టి నెక్స్ట్ ప్రాజెక్ట్ అనౌన్స్‌మెంట్ వచ్చేసింది. ‘జాతిరత్నాలు’ తర్వాత మరో ఫుల్‌ఫిల్డ్ ఎంటర్‌టైన్మెంట్‌‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సితార ఎంటర్‌టైన్మెంట్స్, ఫార్చూన్ ఫర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి కళ్యాణ్ శంకర్ దర్శకత్వం వహిస్తుండగా.. బెస్ట్ డోస్ ఆఫ్ ఫన్ అండ్ ఎంటర్‌టైన్మెంట్‌కు రెడీ అవుతున్నామని ప్రకటించారు. ఈ అనౌన్స్‌మెంట్‌తో ఖుష్ అవుతున్న నవీన్ పొలిశెట్టి ఫ్యాన్స్.. మేము నవ్వడానికి సిద్ధంగా ఉన్నాం, మీరు నవ్వించేందుకు సిద్ధమైపోండి అని చెబుతున్నారు. ఈ సారి కామెడీ మామూలుగా ఉండదని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రం నవీన్ పొలిశెట్టికి ఫోర్త్ ఫిల్మ్ కాగా.. సితార ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌లో వస్తున్న 15వ చిత్రం కావడం విశేషం.



Next Story

Most Viewed