వయనాడ్‌‌లో రాహుల్ గాంధీపై తప్పక ఓడిపోతాడు: అన్నామలై

by Disha Web Desk 12 |
వయనాడ్‌‌లో రాహుల్ గాంధీపై తప్పక ఓడిపోతాడు: అన్నామలై
X

దిశ, వెబ్ డెస్క్: తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నమలై పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు వాయనాడ్‌లో జరిగిన రోడ్‌షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దేశ ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. వాయనాడ్‌లో 'కె. సురేంద్రన్‌ గెలవబోతున్నారు. ఆయన రాహుల్‌ గాంధీని ఓడించేందుకు ఆయన ఇక్కడకు రాలేదు, ప్రజలకు సేవ చేసేందుకు వచ్చారని అన్నారు. వాయనాడ్‌కు గత ఐదేళ్లలో ఏం చేశారో చెప్పేందుకు రాహుల్ గాంధీ శ్వేతపత్రం సమర్పించగలరా? అని ప్రశ్నించారు. అలాగే వాయనాడ్ ముద్దుబిడ్డ అయిన సురేంద్రన్‌ తమ ప్రాంత ప్రజలను ఎల్లప్పుడు కాపాడుకుంటడన్నారు.

ఇక్కడి జీవన నాణ్యతను మెరుగు పరచడానికి ఈ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేయడం అవసరం. అలాగే కాంగ్రెస్ కష్టపడి సంపాదించే వారి సంపదను కొల్లగొట్టి ఓటు బ్యాంకు కోసం పంచిపెట్టాలని చూస్తొందని ఆరోపించారు. ప్రజలు తమ ఇళ్లలో ఆర్థిక సర్వేను ఎందుకు అనుమతించాలి. రాహుల్ గాంధీ ఏమి చెప్పారో స్పష్టం చేయండి. రాహుల్ గాంధీ వయనాడ్ లో గెలిచిన తర్వాత ఐదు సంవత్సరాల్లో 10 సార్లు కూడా ఇక్కడకు రాలేదు. కానీ ఎన్నికలు రాగానే వస్తున్నాడు. వాయనాడ్ ప్రజలు ఆలోచించి అభివృద్ధి కోసం ఓటు వేయండని అన్నమలై కోరారు.

CLICK HERE FOR TWITTER VIDEO



Next Story

Most Viewed